5 March, 2026 | 5:20 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

వృక్షాల నరికివేతపై అటవీ శాఖ స్పందించాలి

23-02-2026 08:21 PM

మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేత పై అటవీ శాఖ స్పందించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. సోమవారం  జిల్లా ఫారెస్ట్ ఏవో కెఎస్ఎన్ మూర్తికి ఫిర్యాదు చేసినట్లు  బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో  సుమారు 50 ఏళ్ల వయసున్న వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా  నరకించిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విష యంపై అటవీ శాఖ స్పందించకపోతే   గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా పీవీ కాలనీలో అనుమతి లేకుండా నరికించిన  ఇతర వృక్షాలపై కూడా విచారణ జరిపించి చెట్లను రక్షించాలని  పర్యావరణ పరిర క్షణ తగు చర్యలు చేపట్టాలని కోరారు.