23-02-2026 08:21:47 PM
మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేత పై అటవీ శాఖ స్పందించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఫారెస్ట్ ఏవో కెఎస్ఎన్ మూర్తికి ఫిర్యాదు చేసినట్లు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 50 ఏళ్ల వయసున్న వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా నరకించిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విష యంపై అటవీ శాఖ స్పందించకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా పీవీ కాలనీలో అనుమతి లేకుండా నరికించిన ఇతర వృక్షాలపై కూడా విచారణ జరిపించి చెట్లను రక్షించాలని పర్యావరణ పరిర క్షణ తగు చర్యలు చేపట్టాలని కోరారు.