calender_icon.png 26 June, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనాలతో నగరాలకు కొత్త ఊపిరి

06-04-2025 12:00:00 AM

డా. ముచ్చుకోట సురేష్‌బాబు :

నగరాలు ఒకవైపు వాతావరణ మా ర్పులను తీవ్రతరం చేసేలా కార్బ న్ ఉద్గారాలను గణనీయంగా పెంపొందించడానికి పెద్ద ఎత్తున కారణమవుతున్నా యి. మరోవైపు అవే నగరాలు వాతావరణ విపత్తులవల్ల గణనీయంగా ప్రభావితమవుతాయి కూడా. 2021లో విడుదలైన ‘గ్లోబ ల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్’ భారతదేశాన్ని వాతావరణ సంబంధ తీవ్ర ఘటనల (తుపానులు, వరదలు, వేడిగాలులు వంటివి) నుంచి ఎక్కువగా ప్రభావితమైన 7వ దేశం గా పేర్కొంది.

పేలవమైన ప్రణాళిక, పట్టణ నిర్వహణకు భారతీయ నగరాలకు ఏటా రూ. 2.6 నుంచి 13 బిలియన్ల మధ్య ఖర్చు అవుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నా యి. అటు పట్టణీకరణ, ఇటు వాతావరణ మార్పు రెండింటి సమస్యలనూ ఏక కా లంలో పరిష్కరించడంలో నగరాలు వెనుకంజలో ఉన్నాయి. వాతావరణం పరంగా -సున్నితమైన పట్టణాభివృద్ధిని బలోపేతం చేయడానికి పర్యావరణానుకూల దృష్టి కీలకమవుతుంది.

ఈ పద్ధతిలోనే పట్టణ అ భివృద్ధి కోసం సమగ్ర అవగాహన చాలా ముఖ్యమైంది. గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రారంభించిన ‘క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్’ ఈ అంతరాన్ని పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాలలో వృక్షజాలం, జంతుజాలం తదిదర జీవజాతులు ఇప్పుడు గణనీయంగా అంతరించి పోయాయి. 

పట్టణ ప్రాంతాలలో పెరిగిన పట్టణీకరణకుతోడు మూగ జీవరాశుల ఆవాసాలు అదృశ్యం అవుతున్నాయి. నగరంలో వైవిధ్యమైన జాతుల స్థితి ఉనికికి పూర్తి స్థాయి ముప్పు పొంచి ఉంది. ప్రణాళికా రంగం లో పట్టణ జీవవైవిధ్య పరిరక్షణ వ్యవస్థల ను సమగ్ర పరచడానికి వ్యూహాత్మక చర్య లు అవసరం.

అయితే, ఈ పరిస్థితులకు అతీతంగా పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తుండటంతో విశ్రాంతి, మనఃశ్శాంతి, కాలుష్యం రహిత గాలి కోసం బహిరంగ ప్రదేశాలు, ఉద్యానవనాలు, తోటల పెంప కం వంటివాటి విలువను ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు.  పట్టణాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న నేపథ్యంలో ప్రజ లు ఇప్పుడు కోల్పోతున్న ప్రకృతిదనంలోని గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు.

ఈ తరహాలో ప్రాకృతిక ప్రదేశాల ఆవశ్యకత బాగా పెరిగిపోయింది. అందువల్ల, ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి పట్టణ ప్రణాళికతో కలిసి వెళ్ళే బయో- సౌందర్య ప్రణాళిక అవసరమని నిపుణులు అంటున్నారు. 

మళ్లీ ప్రకృతికి దగ్గర కావాలి

‘సౌందర్య ఇంద్రియాలు’ అనే పదం వె నుక అందం, దయ వంటి సుకుమార లక్షణాలను అనుభవించే మానసిక స్థితి ఉం టుంది. దృష్టి, వినికిడి వంటి ఇంద్రియాలను కూడా సాధారణంగా ‘సౌందర్య ఇం ద్రియాలు’గా గుర్తిస్తారు. కానీ, వాసన, రు చి, స్పర్శ వంటివి ఇందులోకి కావు. సౌంద ర్య శాస్త్రంలో కళ అభిరుచితోపాటు ప్రధా న అంశాలలో అందం ఒకటి.

చాలావరకు ఒక వస్తువు సౌందర్య ఆనందంతో కూడి ఉంటే అది అందంగా ఉంటుందనే ఆలోచన ఉంటుంది. అందమైన వస్తువుల ఉ దాహరణలలో ప్రకృతి దృశ్యాలు, సూర్యాస్తమయాలు, కళాకృతులు ఉన్నాయి. అం దం అనేది సానుకూల సౌందర్య విలువ. ఇది వికారాన్ని, దాని ప్రతికూల ప్రతిరూపంగా విభేదిస్తుంది. అలంకార మొక్కలు, పువ్వులు ప్రాచీన కాలం నుంచి మన నాగరికతతో ముడిపడి ఉన్నాయి.

అలంకార మొక్కగా పిప్పల్ చెట్టు మోహెన్-జో-దారో ముద్ర నుంచి వచ్చింది. అదే కాలంలో మ రొక ఉదాహరణగా ఏడుస్తున్న విల్లోను పోలి ఉండే అలంకార మొక్క వాడకాన్ని వ ర్ణిస్తుంది. ఇది హరప్పా సీల్స్ నుంచి వ చ్చింది. మన ప్రాచీన క్లాసిక్ సాహిత్యంలో కూడా పువ్వులు, తోటల గురించిన ప్రస్తావన ఉంది.

వేణి, గజ్రా, దండలు మొద లైన వంటి వాటి తయారీ, గృహ ఉపయోగాలకు,  వివాహం, పుట్టిన రోజు, మతప రమైన సమర్పణలు  ఇతర సామాజిక స మావేశాల వంటి వివిధ వేడుకల కోసం వదులుగా ఉండే పువ్వులు పండిస్తున్నారు. అయినప్పటికీ, దేశీయ ఎగుమతి ప్రయోజనాల కోసం వాణిజ్య స్థాయిలో కత్తిరించి న పువ్వుల పెంపకం మన దేశంలో ఇటీవల కాలంలో ప్రారంభమైంది.

పూల పెం పకం అనేది ఉద్యాన వనంలో ఒక ముఖ్యమైన శాఖ. ఇది కత్తిరించిన లేదా వదులు గా ఉండే పువ్వులు, అలంకార మొక్కలు, ఆకుల మొక్కలు, చెట్లు, పొదలు, వెదురు, కాక్టి, సక్యూలెంట్లు, ఎండిన పువ్వులు, ముఖ్యమైన నూనెలు  ప్రకృతి దృశ్య తోటపని వంటివాటితో కూడి ఉంటుంది. 

పూలు, అలంకార మొక్కల పెంపకం

నగరాల్లో కాలుష్యరహిత వాతావరణానికి ఒక అవసరంగా ఈ సౌందర్య ప్రాకృతి క సాధానాలన్నీ మారుతున్నాయి. పూల పెంపకం అనేది అలంకార ఉద్యానవన శా స్త్రంలోని ఒక ముఖ్య విభాగం. ఇది పుష్పా లు, అలంకార మొక్కలను పెంచడం, అ మ్మడం, అమర్చడం వంటివాటితో వ్యవహరిస్తుంది.

సమశీతోష్ణ వాతావరణాల్లో మొక్కల పెంపకం వ్యవస్థల్లో పువ్వులు, కుండీలలో పెరిగే మొక్కలు ఎక్కువగా పెం చుతారు. కాబట్టి, కొన్ని పువ్వులను నర్సరీలు లేదా పంటపొలాలలో ఆరుబయట పండిస్తారు. పూల పెంపకాన్ని గ్రీన్‌హౌజ్‌లో సాగించడం, ఇంటి లోపల మొక్కలు గా ఉపయోగించడం.. రెండూ ఉంటాయి. 

మన నగర ఉద్యానవనాలు, ట్రాఫిక్ ఐ లాండ్స్ ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. రహదారుల వెంబడి చెట్లు కాలి బూడిదైన సందర్భాలలో ట్రాఫిక్ ఐలాండ్స్ అన్నీ కమురు వాసన కొడుతుంటాయి. కొన్ని ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులతో దర్శనమిస్తుంటాయి. ఈ రకంగా మారుతున్న పట్టణ వాతావరణాలలో సంభవిస్తున్న మార్పులను గురించి  పట్టించుకునే వారే కరువయ్యారు.

వంద కరోనాలు వచ్చినా మనం నేర్చుకునేది శూన్యం. మనం  నేర్చుకున్నది విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, పం ట వ్యర్థాలను తగులబెట్టడం, పండుగలు పబ్బాల పేరుతో ప్రకృతిని నాశనం చేయ డం, తాగునీటిలో  హానికరమైన విగ్రహాల ను నిమజ్జనం చేయడం వంటివి. ఈ నేపథ్యంలో పట్టణీకరణకు పార్కులు నిలువె త్తు రూపమని అందరం గుర్తించాలి. వాటి ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచాల్సి ఉంది.

పార్కులు ప్ర స్తుతం అధికారుల నిర్లక్ష్యంతో, ప్రజాప్రతినిధుల చెల్లని హామీలతో కునారిల్లుతు న్నాయి. వాటి పట్టించుకోవడం అల్ప ప్రాధాన్యంగా మారింది. పచ్చదనంతో కళకళలాడ వలసిన పార్కులు పిచ్చిమొక్కల తో వెలవెల బోతున్నాయి. ఆట పాటలు, పిల్లల కేరింతలతో అలరారాల్సింది పోయి ఆకతాయిలకు అడ్డాలుగానూ మారుతున్నాయి.

ఈ రకమైన పరిస్థితి దాదాపు దే శంలోని అన్ని నగరాలలోని అనేక పార్కులలోనూ  కనిపిస్తున్నది. కాలనీలలో, బస్తీ లలో ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్‌లు ఏ ర్పాటు చేసుకోవచ్చు. వీటివల్ల యువకులకు ఎంతో లబ్ది చేకూరుతుంది. పట్టణ, నగర ప్రజలకు వినోదం, ఆహ్లాదం బాగా కరువవడమేకాదు, వాటికోసం ఎంతసేపు సినిమాలు, షికార్లు అంటూ వేల రూపాయలు వెచ్చించుకొనే పరిస్థితి నెలకొంది. 

అటు ఆరోగ్యం, ఇటు ఆహ్లాదం

మన రాష్ట్రంలోని చాలావరకు నగరాల పార్కుల నిర్వహణ మెరుగు కావలసి ఉం ది. ఉద్యానవనాలను తక్షణం కాపాడుకోవాలి. ఖాళీజాగాలు లేక ప్రజలు అల్లల్లాడు తుంటే, ఉన్న కొద్దిమేర పార్కులనైనా బా గు చేసుకోవాలి. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ఎప్ప్పటికప్పుడు అవసరమైన నిధులు కేటాయించాలి.

ప్రజలు నిర్వాసితుల సంక్షే మ సంఘాలతో పార్కుల అభివృద్ధికి చర్య లు చేపట్టాలి. పార్కులలో చిన్నారులకు ఆటవిడుపు కోసం జారుడు బల్లలు, ఉయ్యాలలు, ఓపెన్ జిమ్‌లు వంటివాటితోపాటు వాకింగ్ ట్రాక్‌లను యుద్ధ ప్రాతి పదికన ఏర్పాటు చేయాలి. నగర ప్రజలు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే విధంగా నియోజక వర్గాలలోని పా ర్కులను తీర్చిదిద్దాలి.

చిన్నారులను ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట వస్తువులతోపాటు ఆయా పార్కులలోని విశాల మై దానాలను అందుబాటులోకి తేవాలి. పిల్లలకు శిశుప్రాయంలో పార్కులలో నడక వంటి మంచి ఆరోగ్య అలవాట్లు పెంపొందింపచేయాలి.

ఉదయం సాయంత్రం వేళ ల్లో స్థానికులు సరదాగా గడపడానికి దూ ర ప్రాంతాలకు వెళ్ళకుండా అన్ని నివాస కేంద్రాలల్లో వున్న పార్కులు చక్కగా దోహద పడతాయి. స్మార్ట్ సిటీ, అమృత్ నగరాల కార్యక్రమాలలో భాగంగానైనా సుందరీకరణకు నోచుకోని ఉద్యాన వనాలను ప్రభుత్వాలు తక్షణం వాడకంలోకి తేగలిగితే ఎంతో మేలు చేసినట్టవుతుంది.