06-04-2025 12:00:00 AM
డాక్టర్ ఎమ్. అఖిలమిత్ర :
తాజా పండ్లు రుచికరంగా ఉండటమే కాక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ను మెండుగా కలిగి ఉంటాయి. సహజఫలాలను నేరుగా తిన్నా సరే లేక రసాల రూపంలో తీసుకున్నా వాటిద్వారా అందే పోషక విలువల్లో దాదాపు ఎటువంటి తేడా ఉండదు. పండ్ల రసాల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పండ్లను నేరుగా తీసుకోవడం మేలు. దీనికిగల కారణం పండ్లలో విటమిన్లు, ఖనిజాలతోపాటు ఫైబర్ కూడా ఉంటుం ది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
వేసవి కాలం మొదలైంది. రోడ్ల వెంట శీతల పానీయాల దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిసాయి. గోళీ సోడా, నన్నారి, బాదాం పాలు, ఐస్క్రీమ్లు, లస్సీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఎప్పటికీ తెగదు. రకరకాల పేర్లతో అనేక శీతల పానీయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తిండి ధ్యాస ఎక్కువగాగల స్వభావాన్ని ‘జిహ్వ చాపల్యం’ అంటారు. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
వ్యక్తులనుబట్టి అభిరుచులూ మారుతూ ఉంటాయి. లస్సీలో కొందరు క్రీమ్ కావాలని కోరుకుంటే, మరి కొందరు ఎక్కువ రంగులను కోరుకుంటారు. అయితే, ఇలాంటి పానీయాలు చాలా ప్రమాదకరం. కలర్ ఎక్కువగా ఉండే పండ్ల రసాలు విరివిగా దొరుకుతాయి. వీటిల్లో డ్రై ఐస్ కలిస్తే అనారోగ్యం కలుగక మానదు. ఈ కోలి బ్యాక్టిరియాతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
డయేరియా, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పానీయాలను అదే పనిగా ఎక్కువ కాలం తీసుకుంటే క్యాన్సర్ మహమ్మారుల బారిన పడే విపత్తూ లేకపోలేదు. ఇంద్రియాలు మనకు ఆశా ప్రేరకాలుగా పని చేస్తాయి. ఆహార పదార్థాల్లో కొన్ని రుచిగా అనిపిస్తే మరికొన్ని మాత్రం వెగటుగా ఉంటాయి. దీనికి కారణం నాలుకపైగల రుచి మొగ్గలు. అయితే, రుచికరం, వెగటు అనే తేడాలను జయించి సమత్వం పాటిస్తే జిహ్వ చాపల్యం పోతుంది. దాన్ని జయించిన తర్వాత ఏమి తిన్నా ఒకటే.
సహజ ఫలాలే శ్రేయస్కరం
తాజా పండ్లు రుచికరంగా ఉండటమే కాక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ను మెండుగా కలిగి ఉంటాయి. సహజఫలాలను నేరుగా తిన్నా సరే లేక రసాల రూపంలో తీసుకున్నా వా టిద్వారా అందే పోషక విలువల్లో దాదాపు ఎటువంటి తేడా ఉండదు. పండ్ల రసాల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పండ్లను నేరుగా తీసుకోవడం మేలు. దీనికిగల కారణం పండ్లలో విటమిన్లు, ఖనిజాలతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది.
ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయం చేస్తుంది. రసంలో ఫైబర్ లేకపోవడం వల్ల చక్కర స్థాయి వేగంగా పెరుగుతుంది. మితమైన పరిమాణంలో పండ్లు తినడం ద్వారా ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందువల్లే రసాలకు బదులుగా పండ్లను నేరుగా తీసుకోవ డం మంచిది.
ప్రతిరోజు కొంతమేర పండ్ల రసం తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21 శాతం పెరుగుతుందని హా ర్వర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. పండ్లనుంచి రసాలు తీసే ప్రక్రియలో ఆరోగ్యాని కి మేలు చేసే ఫైటోకెమికల్స్, ఫైబర్ల మోతాదులు తగ్గుతాయి. దీంతోపాటు ద్రవాలు పండ్లకంటే వేగంగా శోషణకు గురవుతాయి. ఫలితంగా ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు మారే ప్రమాదం ఉంది.
సమతుల ఆహారం
వారానికి కనీసం రెండుసార్లు తాజా పండ్లను తినాలి. ముఖ్యంగా బ్లూబెర్రీలు, ద్రాక్ష, నారింజ, జామ, ఆపిల్ వంటివి తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం 23 శాతం తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా శరీర బరువు తగ్గుతుందని అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. బెర్రీ పండ్లు, జామ, ఆపిల్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు బరువు తగ్గడంలో ఎక్కువగా సహాయపడతాయి.
పండ్లు, పుష్కలంగా కూరగాయలు, లీన్ ప్రొటీన్, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. పండ్ల రసాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పండ్ల నుంచి తయారవుతాయి. ప్యాక్ చేసిన పండ్ల రసాల్లో చక్కెర కేలరీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పండ్ల రసాలను తాగడం ఆరోగ్యకరం అని కొందరు భావిస్తూ ఉంటారు.
అయితే, అలాంటి వారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రసాల వల్ల బరువు తగ్గొచ్చని నిరూపించే ఏ ఒక్క అధికారిక పరిశోధనా లేదు. పండ్ల రసాల్లో ఎక్కువగా కేలరీలు ఉండటం మూలంగా బరువు తగ్గడానికి బదులు, మరింత పెరిగే ప్రమాదమూ ఉంది. అలాగే, ఇవి బరువు తగ్గే ప్రక్రియను మరింత కష్టతరంగా మారుస్తాయి.
రోజూ ఒక గ్లాసు పండ్ల రసం తాగడం వల్ల మూడేళ్లలో అరపౌండు బరువు పెరిగే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. కనుక, పండ్లను నేరుగా తింటేనే అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిని చిరుతిండిగా లేదా సలాడ్ల రూపంలో ఇలా ఏదో ఒక రకంగా రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకోవాలి.
సీజనల్ పండ్లకు ప్రాధాన్యం
కొద్ది రోజుల క్రితం సుమారు రుతుక్రమం ఆగిపోయిన సుమారు 50 వేల మంది మహిళలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోడా వంటి చక్కెర పానీయాలను క్రమం తప్పకుండా తీసుకునే వారితో సమానంగా పండ్ల రసం తాగే మహిళలు బరువు పెరిగినట్టుగా వారు గుర్తించారు.
వేసవిలో ఒంట్లోని శక్తి వేగంగా తగ్గిపోతుంది. ఈ సీజన్లో లభించే పండ్లను తీసుకుంటే ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు. ఈ కాలంలో బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడి, పుచ్చకాయ వంటివి మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. పండ్లలో బెటాకెరోటీన్, యాంటీ- ఆక్సిడెంట్లు, విటమిన్--సీ, పొటాషియం, విటమిన్-బీ వంటివి ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది.
ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రుచికి పుల్లగా ఉండే నిమ్మ, నారింజ పండ్లలో విటమిన్-సీ అధికంగా ఉంటుంది. వీటిని నేరుగానూ వీలుకాని యెడల రసాల రూపంలోనైనా తీసుకోవచ్చు.