26 May, 2026 | 6:27 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

బాలల పరిరక్షణ చట్టాలను పక్బందికగా అమలు

14-11-2025 10:17 PM

మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బేల,(విజయక్రాంతి): మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని బేల ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో బేల మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీనీ ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వామి పలు విషయాలు, చట్టాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఆంజనేయులు మాట్లాడుతూ... బాలలకు సురక్షితమైన ఎదిగే వాతావరణం అందించడం కొరకు మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ పర్యవేక్షణ చేస్తుందన్నారు. కమిటీ ద్వారా ప్రతి రెండు మూడు నెలల కు ఒక్కసారి సమావేశం తో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధింత మండలం అధికారులకు ఆదేశాలు ఇవడం జరుగుతుందనరు. మండలంలో బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని మండలంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.