23 May, 2026 | 2:52 AM

చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్లు

23-05-2026 02:00 AM

రఘనాథపాలెం, మే 22 (విజయక్రాంతి) : ఖమ్మం నగరంలోని బురహాన్పురం బస్ డిపో రోడ్ నందు గల అయ్యప్ప టెంట్ హౌస్ & క్యాటరింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చల్లని త్రాగు నీరు ‘చలివేంద్రం‘ ను 45 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుడిగం శ్రీనివారావు, జక్కుల లక్ష్మయ్య లు  ముఖ్య అతిధిగా హాజరై రిబ్బన్ కత్తిరించి చలివెంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేసవిలో మంచినీరు ఎక్కువగా త్రాగాలని వారు కోరారు.

డిపోరోడ్డు లో ప్రజలకు, బాటసారులకు చల్లని నీరు ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమని వారన్నారు. ఈ కారక్రమం లో అయ్యప్ప టెంట్ హౌస్ అధినేత జక్కుల వెంకటరమణ, మారుతీ ప్లస్ ఛానల్ యండి వెంకట్, డాక్టర్ గోపాల్,కోపూరి గిరి,జక్కుల రాఘవేంద్ర, శేషు, పులి చిన్ని, కందుకూరి మహేష్, మిల్లు శ్రీనివాస్, నల్లగట్టు మహేష్ బాబు, వీరబాబు,కనకపూడి కృష్ణ, తంగేళ్ల కార్తిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.