calender_icon.png 3 January, 2026 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మూసీ’ లక్ష కోట్లా.. లక్షన్నర కోట్లా?

03-01-2026 12:32:34 AM

ప్రాజెక్ట్ అసలు అంచనా ఎంతో ప్రభుత్వం చెప్పాలి

సుందరీకరణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా?

పేదల ఇళ్లను కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం

అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పా లని, సీఎం ఒకసారి లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్ర శ్నోత్తరాల్లో హరీశ్‌రావు మాట్లాడారు.

పిల్లలకు స్కాలర్‌షిపులు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారని, రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారని, మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూ సేకరణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చారా?, వేజ్ లాస్ చెల్లించారా?, లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకా రం ఒ క్కో కుటుంబానికి రూ.14.5 లక్షల డబ్బు ఇవ్వాలి.

వాళ్ల పాత ఇంటికి ఆర్‌అండ్‌బీ ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలని, అలాగే సేల్‌బుల్ రైట్స్‌తో కూడిన 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలని సూచించారు. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారని అడిగారు. ప్రభుత్వం ఐడెం టిఫై చేసిన కూల్చవలసిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్ని?, ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారని ప్ర వ్నించారు. ‘మంత్రి సమాధానం చెబుతూ హెచ్‌ఎండబ్ల్యూఎస్ నీటిని హిమాయత్ సా గర్, ఉస్మాన్ సాగర్‌లో పంపింగ్ చేయడానికి పట్టిందని, మూసీ నదిలో ఎప్పటి కప్పు డు విడుదల చేయడానికి రెండున్నర టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగిందని అన్నారు. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు.

అసలు ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా? లేక ఎక్కడి నుం చైనా గాలిలో నుం చి తెస్తున్నారా? ఆ రెండున్నర టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని, ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలి, కానీ, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊ రుకోదని హెచ్చరించారు.