9 April, 2026 | 5:08 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

భీంగల్ పట్టణంలో విజయ దివస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

10-12-2025 01:16 AM

భీంగల్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా మంగళవారం నాడు విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు, ఈన కాచి నక్కల పాలు చేసినట్లు కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడి దొంగల పాలైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..

ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన సందర్భం.  2004 కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్ట దీక్ష చేస్తే దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014 లో తప్పనిసరి పరిస్థితిలో ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు. 2004 లోనే ఇవ్వాలి.

కానీ పదేళ్ల ఆలస్యం తరువాత తెలంగాణ ప్రకటన చేశారు. ఈ ఆలస్యం అనేక మంది బిడ్డల అతబలిదానం చేశారు. కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. రైతులను ఆదుకునే దిక్కులేదు కానీ రైజింగ్ తెలంగాణ అని పోకడకు పోతున్నాడు. మక్కలు కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. రెండు నెలలుగా రైతులకు మక్కల డబ్బులు ఇవ్వట్లేదు,  యూరియా సరిగా రావట్లేదు.  రైతులకు కరెంటు సరిగా ఇవ్వట్లేదు. కరెంటు కోతలు పెరిగినాయి. వరికి రూ.500ల  బోనస్ ఇవ్వలేదు. 

సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఆడబిడ్డలకు రూ. 2500 లు లేవు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదు.ఆసరా పెన్షన్ 4000 లేదు. రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు.  రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగుతోంది. కేసీఆర్  బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్ళీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి.