15 June, 2026 | 9:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

నిత్యం జ్యోతితో వెలిగే అమరుల స్థూపాన్ని నిర్మించాలి

10-12-2025 01:18 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగాల ను  స్మరించుకునే విధంగా ఢిల్లీలోని బాబుగాటు లాగ నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని  తెలంగాణలో నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిసెంబర్ 9 సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడా రు. అమరుల ఆత్మలు సంతోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని నిర్మించాలని కోరారు.