calender_icon.png 12 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యం జ్యోతితో వెలిగే అమరుల స్థూపాన్ని నిర్మించాలి

10-12-2025 01:18:16 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగాల ను  స్మరించుకునే విధంగా ఢిల్లీలోని బాబుగాటు లాగ నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని  తెలంగాణలో నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిసెంబర్ 9 సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడా రు. అమరుల ఆత్మలు సంతోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వెలిగే జ్యోతితో కూడిన స్థూపాన్ని నిర్మించాలని కోరారు.