08-06-2025 12:00:00 AM
మేడ్చల్, జూన్ 7 (విజయక్రాంతి): మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం మేడ్చల్ మండలం పూడూరు శివారులోని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివా సానికి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన రాం నాథ్ కోవింద్ను ఈటల తేనేటి విందుకు ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతికి ఈటల రాజేందర్ పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నాయకులను పరిచయం చేశారు.