calender_icon.png 28 June, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ కేది నివాళి

28-06-2025 02:45:45 PM

మాజీ ప్రధానికి అవమానం  

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి  భారత రాజకీయ చరిత్రలో(Indian Political history) ఆయ నది తనదైన ముద్ర వేసిన కీర్తిశేషులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు(Former Prime Minister PV Narasimha Rao) జిల్లా కేంద్రంలో అవమానం జరిగింది. శనివారం ఆయన 105 వ జయంతిని అధికారులు, నాయకులు విస్మరించారు.  నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి అయినా పీవీ నరసింహారావుకు  గత కాంగ్రెస్‌ పాలకులు ఆయనను విస్మరించినా గత  బీఆర్‌ఎస్‌ సర్కారు(BRS Government) పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. దీంతో ఆయన విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని నల్లగొండ మున్సిపాల్ పార్కులో ఏర్పాటు చేశారు. జయంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులు  ఆ విగ్రహాన్ని శుభ్రం చేయగా అధికారులు నాయకులు మాత్రం  జయంతిని విస్మరించడంతో ఆయన విగ్రహం వేలవేల పోయింది.