14-01-2026 09:13:41 PM
మునిపల్లి,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ జిల్లా, మండల ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, మండల ప్రజల జీవితాల్లో మకర సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని కోరారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన వెలుగులు సరికొత్త విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువకులు, చిన్న పిల్లలు ఎగురవేసే పతంగుల విషయంలో జాగ్రత్తలు పాటించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.