calender_icon.png 14 February, 2026 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 వార్డుల్లో ‘ఫార్వర్డ్ బ్లాక్’ విజయం

14-02-2026 12:58:51 AM

వడ్డేపల్లిలో మొత్తం పది వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు కైవసం

విజయక్రాంతి, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అ భ్యర్థులు 22 స్థానాల్లో విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డే పల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) షాక్ ఇచ్చింది. మునిసిపాలిటీలో మొత్తం 10 వార్డుల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సింహం గుర్తు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కో స్థానానికి పరిమితం అయ్యాయి.

ఈ విజయం సందర్భంగా కార్యకర్తలు సింహం గుర్తు జెండాలతో భారీర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. 9 వార్డులో ఏఐఎఫ్‌బీ తరఫున బరిలో నిలిచిన నాయకి అజయ్‌పై బీఆర్‌ఎస్ అభ్యర్థి పోలకల్ సూరి 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సా ధించారు. ఇక రామగుండం కార్పొరేషన్‌లో ఏఐఎఫ్‌బీ 6, పెద్దపల్లి  మున్సిపాలిటీలో 5, నల్లగొండ కార్పొరేషన్‌లో4, కరీంనగర్ కా ర్పొరేషన్‌లో2, మంచిర్యాల కార్పొరేషన్‌లో ౨, దుబ్బాక, జమ్మికుంట, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానంలో గెలిచింది.