13-06-2025 11:07:37 PM
చండూరు, మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల పరిధిలోని ఖుదబాక్షపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు రమావత్ కవిత ఆధ్వర్యంలో ముగ్గులు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఊరిపక్క జంగయ్య, పందుల పాండు గౌడ్, ఎస్కే షబ్బీర్, పోతురాజు ఆంజనేయులు, జావిద్, గిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.