14-06-2025 12:00:00 AM
అక్రిడేషన్ పాలసీ విధివిధానాలను ప్రకటించాలి
ముఖ్యమంత్రికి డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్
ఖైరతాబాద్; జూన్ 13 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ లలో ఇంత జాప్యం తగదు అని, అక్రిడేషన్ పాలసీ విధివిధానాలను వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు... అక్రిడేషన్ పాలసీని సరళీకృ తం చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే కార్డులను జారీ చేయాలన్నారు. పటిష్ఠమైన ఇన్సూరెన్స్, ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వను న్నట్లు తెలిపారు.
రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ అంశాలపై ప్రధాని మోదీకి విన్నవిస్తామని చెప్పా రు. జర్నలిజం ప్రింట్ మీడియా నుంచి మొదలై వివిధ రూపాలకు విస్తరించినందున పాత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నా సామాజి క అంశాల్లో జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. వారి పక్షాన పోరాడేందుకే వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఆవిష్క రించిందన్నారు.
ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో బీఎంఎస్కు అనుబంధంగా పని చేస్తున్నామని, త్వరలో నేపాల్కు కూడా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు.
నేడు విద్యా సదస్సు, పాత్రికేయులకు పురస్కారాలు
జాతీయ విద్యావిధానం -2020, మీడి యా పాత్ర అనే అంశంపై డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూజేఐ రాష్ట్ర గౌరవాధ్య క్షుడు నందనం కృపాకర్ తెలిపారు. సా యంత్రం 5 గంటలకు ఉత్తమ జర్నలిస్టులకు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జర్నలిస్ఠులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.