21-06-2025 12:37:32 AM
చేగుంట, జూన్ 20 : చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు కర్రె స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం చాలా సంతోషకరం ఉందని తెలిపారు. గ్రామానికి 15 ఇండ్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఏఈ మహమ్మద్ రియాజ్, గ్రామ కార్యదర్శి స్రవంతి, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్, స్వామి, నర్సింలు, రాజేశ్వరి, సౌందర్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం, నరేష్, కే స్వామి, సురేష్, జె స్వామి, స్వామి, యాదగిరి, లక్ష్మణ్, అంజి, నర్సింలు, వెంకట్, దుర్గయ్య, శేఖర్, నర్సింలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.