8 July, 2026 | 8:46 PM

Breaking News

సమస్యలు పరిష్కరించాలని వినతి   •   ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చావా రామకృష్ణ   •   ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి   •   ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •  

ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన

25-03-2025 06:21 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని పోచారం తండాలో మంగళవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో భాగంగా 10 లక్షల రూపాయలతో పోచారం తండాలో సీసీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేయబడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా పెద్ద కొడప్గల్ మండలానికి గ్రామానికి నిధులు ఇచ్చినందుకు గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మషనప్ప పటేల్, శామప్ప పటేల్, బంతిలాల్, నాగరాజ్, పడవాల్ బచ్చన్, కానా నాయక్, నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.