10 June, 2026 | 6:21 PM

Breaking News

మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •  

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టులు మృతి

06-11-2025 11:05 AM

న్యూఢిల్లీ: మావోయిస్టుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లో గురువాం జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Chhattisgarh encounter) మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు  కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో  ముగ్గురు మావోయిస్టు తిరుగుబాటుదారులు మృతి చెందినట్లు ధికారులు పేర్కొన్నారు.

పోలీసులు, పారామిలిటరీ దళాల సంయుక్త బృందాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.  ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. 2026 మార్చి నాటికి భారత్ నుండి మావోయిజాన్ని నిర్మూలించడానికి కేంద్రం నిబద్ధతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పునరుద్ఘాటించారు. జనవరి 2024లో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, 2,100 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 1,785 మందిని అరెస్టు చేశారు. వివిధ ఆపరేషన్లలో 477 మంది మరణించారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి షాకిస్తూ కీలక మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.