15 June, 2026 | 7:17 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

హర్మన్ సేనకు నాలుగో విజయం

13-09-2024 12:46 AM

హులున్‌బిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న టీమిండియా నాలుగో విజయాన్ని అందుకుంది. గురువారం గ్రూప్ దశలో భారత్ 3 తేడాతో కొరియాను చిత్తు చేసింది. భారత్ తరఫున అరయ్‌జీత్ సింగ్ (ఆట 8వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (9వ, 43వ ని.లో) జట్టుకు గోల్స్ అందించారు. ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్‌ఫ్లికర్లలో ఒకడైన హర్మన్ ప్రీత్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడం విశేషం. ఇక కొరియా తరఫున జిహున్ యాంగ్ (30వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. ఇక భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో శనివారం ఆడనుంది.