calender_icon.png 1 May, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ ​సీట్లు ఇప్పిస్తామని మోసం

30-04-2025 10:28:11 PM

దశలవారీగా లక్షల నగదు వసూలు..

అదుపులోకి తీసుకున్న హయత్​ నగర్​ పోలీసులు..

ఎల్బీనగర్: ఎంబీబీఎస్ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్​ సీటు ఇప్పిస్తానంటూ రూ. 52 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని  హయత్​నగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు గౌడ్​, బాధితుడు బాలునాయక్​ వివరాల ప్రకారం.. హయత్​నగర్​ పరిధిలోని గౌతమ్​నగర్​కు చెందిన కుక్కడపు చంద్రకాంత్ గౌడ్(37) అలియాస్ టింకూ బాయ్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి గ్రామానికి చెందిన  ముడావత్​ బాలు నాయక్​ కుమారుడు  సంతోష్​ చౌహాన్(ఎంబీబీఎస్​చదివే విద్యార్థి)తో వనస్థలిపురంలో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చంద్రకాంత్​గౌడ్​ కరీంనగర్‎లోని చెలిమెడ మెడికల్ కాలేజీలో సంతోష్ ​చౌహాన్ కు ఎంబీబీఎస్ మేనేజ్​మెంట్​కోటా​ సీటు ఇప్పిస్తానని అతడి తండ్రి బాలునాయక్​తో  రూ. 98 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. విడతల వారీగా బాలునాయక్​చంద్రకాంత్​గౌడ్​ అతడి భార్య ఉమారాణికి రూ. 52 లక్షలు చెల్లించారు. కానీ సంతోష్​ చౌహాన్​కు గవర్నమెంట్​కౌన్సెలింగ్​లోనే ఎంబీబీఎస్​ సీటు రావడంతో .. మేనేజ్​మెంట్​కోటా సీటు అవసరం లేదని, తాము ఇచ్చిన నగదు తమకు తిరిగి ఇవ్వాలని కోరారు. చంద్రకాంత్​గౌడ్​ తీసుకున్న రూ. 52 లక్షలలో నుంచి రూ. 26 లక్షలు తిరిగి బాలు నాయక్​కు ఇచ్చారు.  మిగతా రూ. 26 లక్షలు ఇవ్వకుండా మూడేండ్లుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు.

ఎన్నిసార్లు ప్రశ్నించినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తనకు అధికార పార్టీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని బెదిరిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్​కాంగ్రెస్​నాయకులతో కలిసి దిగిన ఫొటోలను బాధితులకు చూపిస్తూ.. మీరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. మంగళవారం హయత్​నగర్​పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే హయత్​నగర్​పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కోర్టు సూచన మేరకు నిందితుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సీఐ నాగరాజు గౌడ్​తెలిపారు.