14-06-2025 04:33:38 PM
రవాణా చార్జీలు లబ్ధిదారులే భరించాలి..
కేసముద్రం తహసిల్దార్ వివేక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సమీప వాగుల్లోంచి ఉచితంగా ఇసుక అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసిల్దార్ జీ.వివేక్(Tehsildar G. Vivek) తెలిపారు. అయితే లబ్ధిదారులు ఇసుక రవాణాకు సంబంధించిన చార్జీలను వారే భరించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇసుక కోసం ఏఈ హౌసింగ్ సూచన మేరకు రెవెన్యూ కార్యాలయం నుండి ఉచిత ఇసుక కోసం కూపన్లు జారీ చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఎటువంటి రుసుము లేకుండా తమకు నిర్దేశించిన వాగుల నుంచి కేటాయించిన మేరకు ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్ళవచ్చని తెలిపారు. కూపన్లు పొందినవారు ప్రభుత్వ మార్గదర్శక ప్రకారం ఇసుకను పొందవచ్చని చెప్పారు. రవాణా చార్జీలు మాత్రం పూర్తిగా లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని తాసిల్దార్ స్పష్టం చేశారు.