14-06-2025 04:35:57 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై వర్షాకాలంలో ఇబ్బందికరంగా మారిన డ్రైనేజీ వద్ద మరమ్మత్తు పనులను శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు(Kasula Balaraju), మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి పర్యవేక్షించారు. స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న పెద్ద డ్రైనేజీ కల్వర్టు లోపల పూడిక పెరుక పోవడంతో చిన్న వర్షానికి మోకాళ్ల లోతు నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు స్టేట్ బ్యాంక్ వద్ద కల్వర్టు పూడిక తీసే పనులను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ దగ్గర ఉండి పనులు చేపట్టారు.
సుమారు 6 గంట ల పాటు ట్రాక్టర్ తో స్లాబ్ కొంత తొలగించారు. కల్వర్టు లోపల 5అడుగుల మేర పూడిక ఉండటం తో కల్వర్టు కు మధ్యలో, రెండు చివరల , డ్రిల్ చేసి పూడిక తీయడం ప్రారంభించారు. బాన్సువాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంకు వద్ద వర్షం వస్తె చెరువును తలపిస్తుంది.దీనికి శాశ్వత పరిష్కారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు.ఆయన తో పాటు స్థానిక నాయకులు మహమ్మద్ ఎజాజ్,బాబా , రఫీక్ తదితరులు పాల్గొన్నారు.