calender_icon.png 7 June, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శుక్రవారం సభ‘ భేష్

07-06-2025 01:11:33 AM

కరీంనగర్, జూన్ 6 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ మంచి కార్యక్రమమని, మహిళా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న ఈ కార్య క్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పం చాయతీరాజ్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి  సీతక్క అన్నారు.

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యా చరణపై హైదరాబాద్లోని రాజేంద్రనగర్ లో గల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈనెల 4, 5న ‘మేధో మథన సదస్సు‘ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు సంబంధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అభివృద్ధి ప్రగతి నివేదికను వివరించగా కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న ‘శుక్రవారం సభ‘ గురించి కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.

మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు, వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి  ఈ సభ ఏ విధంగా ఉపకరిస్తుందో తెలియజేశారు. ‘మేధో మథన సదస్సు‘కు హాజరైన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ కార్యద ర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ శుక్రవారం సభ ప్రజెంటేషన్ ను తిలకించి అభినం దించారు. శుక్రవారం సభను అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం సభ విధివిధానాలను, రాష్ట్రంలో అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడిపిఓలు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయిని కలెక్టరేట్లో శుక్రవారంసత్కరించారు.