07-06-2025 01:13:49 AM
- క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
- సరూర్ నగర్ స్టేడియంలో క్రీడాకారులకు అదనపు సౌకర్యాల కల్పించడానికి కృషి చేస్తా
- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మ ధుయాష్కీ గౌడ్
- సరూర్ నగర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ ముగింపు వేడుకలు
- విద్యార్థులకు పతకాలు అందజేసిన మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, జూన్ 6 : విద్యార్థులు చిన్నప్పటి నుంచే చదువుకోవడంతోపాటు ఆటలు ఆడాలని, క్రీడా రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎం పీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టే డియంలో విద్యార్థులకు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ము గింపు వేడుకలను శుక్రవారం నిర్వహించారు.
ఈ వేడుకలకు మధుయాష్కి గౌడ్, రంగారెడ్డి జిల్లా యూత్ అండ్ స్పోరట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్ ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, బాడ్మింటన్, బాక్సింగ్, స్కేటింగ్ తదితర క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రే వంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్నారు.
స్పోరట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని వివరించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అదనపు సదు పాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి, కలెక్టర్ తోనూ మా ట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోచ్ ల కొరత ఉందని.. రిటైర్డ్ అయిన వాళ్ల స్థానంలో కొత్త వారిని నియమించే విషయంలో ప్రభుత్వంతో మాట్లాడుతానని హా మీ ఇచ్చారు.
సరూర్ నగర్ స్టేడియంలో జిమ్ పరికరాల ఏ ర్పాటు చేయిస్తానని, యోగా శిక్షకులను నియమిస్తామని, పది రోజుల్లో స్పోరట్స్ కిట్స్ ను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మించే విషయంపై మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డితో మధుయాష్కీ మాట్లాడారు. ఆగిపోయిన ప్రహరీని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రా గుల వెంకటేశ్వర రెడ్డి, కోచ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రెటరీ జె.రాజశేఖర్ రెడ్డి, కోచ్ లు ఎంవీ ఫణి కిశోర్, స్వర్ణలత, రవీందర్, సైదులు, సాయి రెడ్డి, సమీరా బేగం, రమాదేవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుడ్డ సత్యనారాయణ, జైపాల్ రెడ్డి, నాయకులు కందికంటి శ్రీధర్ గౌడ్, దాము మహేందర్ యాదవ్, శ్రవణ్ గుప్తా, చెరుకు భవాని, కొండోజు శ్రీనివాస్ , రమాకాంత్, బత్తుల మల్లేశ్ గౌడ్, నాగార్జున రెడ్డి, మహేశ్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.