జూలై 6 నుంచి సీపీగెట్
22-06-2024 12:05 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ యూని వర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేం డ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 6 నుంచి 9 వరకు, 11 నుంచి 13, 15వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం మూడు షిప్టుల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్ష ఉండనుంది. మొత్తం 50 కోర్సులకు సంబంధించిన ప్రవేశాలను సీపీగెట్ ద్వారా చేపడతారు.






