calender_icon.png 10 June, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు

20-05-2025 02:28:15 AM

  1. ఇప్పటికే 5,364 ఇళ్లకు 53.64 కోట్లు విడుదల
  2. ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్
  3. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సోమవారం నాటికి బేస్‌మెంట్ పూ ర్తి చేసుకున్న 1,383 ఇళ్లు, గోడలు పూర్తయిన 224 ఇళ్లకు రూ.16.07 కోట్లు విడు దల చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు బేస్‌మెంట్, గోడలు పూర్తి చేసుకున్న 5,364 ఇళ్ల లబ్ధిదారులకు మొ త్తంగా రూ.53.64 కోట్లను సర్కార్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో జూమ్ మీ టింగ్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు చెల్లింపులపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పూర్తయిన వాటికి ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని చెప్పి, అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు కింద 47,335 ఇళ్లను మం జూరు చేయగా, ఇప్పటివరకు 20,104 ఇళ్లు గ్రౌండింగ్ అయా ్యయని, ఇందులో 5,140 ఇళ్లు బేస్‌మెంట్, 300 ఇళ్లు గోడలు, మరో 10 ఇళ్లు శ్లాబ్‌ల వరకు పూర్తయ్యాయని వెల్లడించారు.

మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా నాలు గు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని స్పష్టంచేశా రు. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత రూ. లక్ష, గోడలు పూర్తయిన తర్వాత రూ.1.25 లక్షలు, శ్లాబ్ పూర్తయితే రూ.1.75లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన రూ.లక్ష విడుదల చేస్తామని వివరించారు. వానకాలాన్ని దృష్టి లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇందిర్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.