పోలీసుల అదుపులో దొంగల ముఠా
14-06-2024 04:13 PM
హైదరాబాద్ : నగర శివారు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ చిలకానగర్ లో గురువారం దొంగల ముఠా దోపిడీ యత్నంచారు. ఓ ఇంట్లో వృద్ధులను బంధించి దొంగతనం చేస్తుండడంతో వృద్ధులు కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకోని దొంగలను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.






