22-06-2025 04:26:51 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రఖ్యాతి గడించిన సీబీఎస్ఈ ఆధారిత ప్రైవేట్ పాఠశాలల్లో 9వ ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష (శ్రేష్ట)లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణం దనసరికి చెందిన పట్ల గౌతం ఆల్ ఇండియా మొదటి బ్యాంక్ సాధించాడు. 400 మార్కులకు గాను గౌతమ్ 344 మార్కులు సాధించి ఎస్సీ కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వెనుకబడిన జాతీయ వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి అవకాశాలను కల్పిస్తూ సీబీఎస్ఈ ఆధారిత పాఠశాలలో ప్రవేశం కల్పిస్తుంది. విద్య, వసతి, భోజనం, యూనిఫాం తదితర ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. శ్రేష్ట ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉత్తమమైన కోర్సుల్లో నైపుణ్య వంతులుగా తీర్చించడానికి దోహదపడుతుంది. జాతీయస్థాయిలో తమ కుమారుడు మొదటి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు కృష్ణవేణి, రవి హర్షం వ్యక్తం చేశారు.