22-06-2025 04:31:21 PM
విద్యార్థులకు పోలీసుల అవగాహన
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మత్తు పదార్థాలు వాటి దుష్పరిణామాలపై పోలీసులు అవగాహన కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆదివారం లంబడి తండా గ్రామంలోని టీఎస్ఆర్జేసీ బాయ్స్ స్కూల్లో మత్తు పదార్థాలపై అవగాహన ప్రోగ్రాం చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్(CI Afzaluddin) మాట్లాడుతూ... యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఎవరూ మత్తు పదార్థాలను తీసుకోవడం చేయకూడదన్నారు.
జీవితాలను, ఫ్యూచర్ ను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలు సేకరించడం, రవాణా చేయడం, అమ్మడం కానీ చేయకూడదని హెచ్చరించారు. విద్యార్థులు తమకు సంబంధించిన బంధువులు, స్నేహితులు ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. అలానే ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మడం సరఫరా చేయడం, పండించినా వారి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలోతాళ్ల గురజాల ఎస్సై రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.