30-05-2025 05:44:39 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో కల్లుగీత కార్మికుడు కొమ్మగాని వెంకటేశం రోజువారి వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వెంకటేశంకు ఇద్దరు కుమారులు ఉన్నారని వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కల్లుగీత కార్మిక సంఘం కార్యదర్శి గాజుల ఆంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పలుసం స్వామి, గ్రామ సొసైటీ అధ్యక్షులు పరకాల ముత్యాలు, పరకాల వెంకటేశం, మల్లేశం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.