calender_icon.png 6 June, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్సవాడలో విషాదం...

05-06-2025 10:27:55 AM

తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి. 

తాడూరు మండలం సిర్సవాడలో ఘటన.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారీపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో(Sirsawada village) చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం చింతకింది మల్లేష్ (35) రోజువారి మాదిరిగానే గురువారం ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.