31-05-2025 01:17:52 AM
హుజూర్ నగర్, మే 30: హుజూర్నగర్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త గెల్లి రవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమ య్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నియామక పత్రాన్ని గెల్లి రవికి అందజేశారు. గెల్లి రవి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాకు సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా తన ఛాయ శక్తులకు కృషి చేస్తానన్నారు.తనకి ఈ పదవి రావడానికి కృషిచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో తన్నీరు మల్లికార్జున్, అమర బోయిన సతీష్, త్రిపురమ్ అంజన్ రెడ్డి,పైడిమర్రిరంగనాథ్,ఎడ్ల విజయ్, కోడి ఉపేందర్,కటకం రమేష్, జుట్టు కొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.