calender_icon.png 7 June, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖరీఫ్‌కు సన్నద్ధం!

07-06-2025 01:22:07 AM

- దుక్కులు దున్నుతున్న రైతాంగం

- వానాకాలం సీజన్‌కు సాగు ప్రణాళిక సిద్ధం

- ఈయేడు జిల్లాలో 2 లక్షల 76 వేల 76  ఎకరాల్లో సాగు

- జిల్లాలో పత్తి 52,500 ఎకరాల్లో సాగయ్యే అవకాశం

- అవగాహనపై స్పష్టత ఇవ్వని అధికారులు

పెద్దపల్లి, జూన్ 6(విజయక్రాంతి); వ్యవ సాయశాఖ ఖరీఫ్ సాగుకు సమాయత్తం అ వుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులతో పాటు అనుబంధ శాఖల వా రిని సంప్రదించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. దీనిపై జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష సమావేశం నిర్వహించి ఇప్పటికే సి బ్బందికి దిశానిర్దేశం చేశారు.

ప్రధానంగా ఎరువులు, విత్తనాలు, రైతులకు అందుబా టులో ఉంచటం, సాగులో శాస్త్రీయత పాటించటంతో పాటు నకిలీలపై అప్రమత్తం చేయా లని సూచించారు. ఇదే సమయంలో వారు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. డివిజన్ లు, మండలాల వారీగాఅందుబాటులో ఉంచాల్సిన ఎరువులు తదితర అంశా లపై ఆ శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

అవగాహనపై రైతులకు స్పష్టత ఏదీ

ఖరీఫ్ లో భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, అందుబాటులో ఎరువులు, తదితర వివరాలను తెలియజేయాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణపై స్పష్టత లేదని గ్రామీణ ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు తదితర అంశాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.  గతంలో ప్రభుత్వమే పలు రకాల విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై అ ందించేది, గత ఐదారు ఏళ్ల నుంచి వాటిపై కోత విధిస్తూ... క్రమంగా నిలిపేశారు. ప్రభు త్వం మారిన నేపథ్యంలో విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై రాయితీ ఇవ్వాలని రైతు లు కోరుతున్నారు.

జిల్లాలో 2 లక్షల 76 వేల 76 ఎకరాల్లో సాగు

జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్లో మొత్తం 2 లక్షల 76 వేల 76 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేయొచ్చని వ్యవసాయ అధి కారులు అంచనా వేశారు. గతేడాది కంటేఈయేడు సుమారు 52 వేల 500  ఎకరాలు అధి కంగా పత్తి పంటను పండించే అవకాశాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో వానాకాలం సీజన్ కు గాను వరి పంట 2 లక్షల 12500  ఎకరాలు,  ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధి కారులు చెబుతున్నారు. అయితే గత ఏడాది వానాకాలం సీజన్ లో 2 లక్షల 72 వేల 678 ఎకరాల్లో సాగవ్వగా, ఈ యేడు అదనంగా సాగయ్యే అవకాశం ఉంది. అయితే వరి, మొక్కజొన్న, జీలుగు, జనుము, సోయాబీన్, కందుల విత్తనాలను సమయా నికి అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో పండించే పత్తి విత్తనాలు లైసెన్సు కలిగిన ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ దుకాణాలలో అవసర మైన మేరకు అందుబాటులో ఉంచేలా చర్య లు తీసుకుం టున్నామని అధికారులు తెలిపారు. ఎరువుల విషయానికొస్తే.. 32 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామని. డిఏపి 7 వేల 899 మెట్రిక్ టన్నులు యూరియా,  కాంప్లెక్స్ 23 వేల 453 మెట్రి క్ టన్నులు,  పొటాష్ 6 వేల 330 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని చెబుతున్నారు.

జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో రైతులకు అం దుబాటులో విత్తనాలు, ఎరువులు ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. 

వ్యవసాయంలో రైతులకు ఎలాం టి అనుమానాలు ఉన్న వెంటనే మండలంలోని అందుబాటులో ఉన్న ఏవోలకు ఏఈ ఓ లకు రైతులు ఫోన్ చేసినా సంప్రదించైనా వారి సలహాలు సూచనలు తీసుకొని నాణ్యమైన వ్యవసాయం చేసి రైతులు అధిక దిగిబ డులు సాధించాలని ఆదిరెడ్డితెలిపారు.