12-06-2025 01:23:10 AM
60 షాపుల్లో పరిశుభ్రతా లోపాలు
హైదరాబాద్,జూన్ 11 (విజయక్రాంతి) : హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన ఫుడ్ సేఫ్టీ వింగ్ ద్వారా స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసింది. జీహెఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విస్తృత తనిఖీల్లో ఇప్పటివరకు 60 స్వీట్ షాపులను తనిఖీ చేయగా, వాటిలో పలు పరిశుభ్రతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
జీహెఎంసీ కమిష నర్ ఆదేశాల మేరకు, ప్రతి సర్కిల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ పరిధిలో కనీసం 5 స్వీట్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ డ్రైవ్ను మరింత ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల సందర్భంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 2011 నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన చోట, లోపాలను సరిది ద్దేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏదై నా పెద్ద ఉల్లంఘనలు గుర్తించిన పక్షం లో, సంబంధిత అడ్జ్యుడికేషన్ అధికారుల ముం దు కేసులను దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.