17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ నోటీసులు

27-06-2025 12:00 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ

చేవెళ్ల, జూన్ 26: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. డీకే అరు ణ ఇంకా సిట్ అధికారులకు ముందు హాజ రుకాలేదు. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ఆయన మొబైల్ నెంబర్‌ను సీడీఆర్ జాబితాలో ఉందని గుర్తించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి. వెంకటగిరి గురువారం నోటీసు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ల నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను శుక్రవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించారు.