06-06-2025 12:12:39 AM
హాజరైన డిప్యూటీ మేయర్ శ్రీలత
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. గురువారం ఈ ముగింపు కార్యక్ర మానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ క్యాంప్ ద్వారా పిల్లల క్రీడా ప్రతిభ, కళా నైపుణ్యాలను వెలికితీసే అవకాశం లభించిందని అన్నారు.
సమ్మర్ క్యాంప్లో క్రీడలు, కళలు, సంగీతం, పర్యావరణ అవగాహన వంటి అనేక అంశాలను పిల్లలు ఆసక్తిగా నేర్చుకున్నారు. ముఖ్యంగా, యువత అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుర్తుచేస్తూ, క్రీడా మైదానాల అభివృద్ధి, శిక్షణా శిబిరాలు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం వంటి పథకాల గురించి ఆమె వివరించారు.
కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులు, శిక్షకులు, జీహెచ్ఎంసీ సిబ్బందికి డిప్యూటీ మేయర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రస న్న, అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ యాదగిరి, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, సుభాష్ రావు, రామాంజనేయులు, రాజు నాయక్ పాల్గొన్నారు.