06-06-2025 12:12:39 AM
యాదాద్రి భువనగిరి జూన్ 5 ( విజయ క్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కొరకు చేపట్టిన ప్రచార జాతను జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు గురువారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక స్పృహ కలిగిన సంఘంగా టీఎస్ యుటిఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు కొరకై ప్రచార జాత నిర్వహించడం అభినందనీయం అన్నారు,ఈ సంవత్సరం జిల్లాలో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలో జిల్లాను ఏడవ స్థానంలో నిలిపినటువంటి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాము.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన, అన్ని విలువలతో కూడిన విద్య అందుతుందని తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ గారు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రచార జాత నిర్వహిస్తున్నామని, హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా భావిస్తున్నటువంటి టీఎస్ యుటిఎఫ్ కేవలం హక్కుల కొరకే కాదు బాధ్యతల కొరకు కూడా నిలబడుతుందని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం అనేది బాధ్యతగా తీసుకొని ఈరోజు జిల్లాలో ప్రచార జాత నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభించాలని, తరగతి ఒక ఉపాధ్యాయుని నియమించాలని ప్రాథమిక విద్య బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిడి కమిటీ కన్వీనర్ జే యాకయ్య, జిల్లా విద్యాధికారి కె సత్యనారాయణ , టీజీజెఏసి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు, టి ఎస్ ఎం ఎస్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే మమత, కోశాధికారి బి ముత్యాలు, కార్యదర్శులు కె రాజగోపాల్, ఎస్ సుధర్మారెడ్డి, కే రవికుమార్, జీవీ రమణారావు, శ్రీదేవి, జిల్లా కమిటీ సభ్యులు సంగు వనిత, పి గోపాలకృష్ణ, డి వెంకన్న, బి నర్సిరెడ్డి, డి రవి, సుదర్శన్ రెడ్డి, పి మురళి, సయ్యద్, కె వెంకన్న, సీనియర్ కార్యకర్తలు సంజీవరెడ్డి, బాలసుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ ఏడి ప్రశాంత్ రెడ్డి, సేక్టోరియల్ అధికారి పి లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.