ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష
30-05-2026 09:39 PM
వెల్దండ: మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు దీక్షకు దిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన మురళీకృష్ణలిద్దరూ గత రెండేళ్లుగా సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించినట్లు యువతి ఆరోపిస్తోంది. ఇటీవల పెళ్లి విషయమై యువతి ఒత్తిడి చేయగా మురళీకృష్ణ నిరాకరించడంతో శనివారం మురళీకృష్ణ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది.






