calender_icon.png 6 June, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెమ్యూనరేషన్ ఇప్పించండి

27-05-2025 12:00:00 AM

ఐటీడీఏ పీఓకి టీపీటీఎఫ్ విజ్ఞప్తి 

భద్రాచలం, మే 26 (విజయక్రాంతి): డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిన తాత్కాలికంగా రూ. 31,040 కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్‌తో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమింపబడిన వారికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రెమ్యూనరేషన్ సంబంధిత ఉన్నతాధికారుల నుండి ఇప్పించాలని, అంతవరకు వారి కుటుంబ ఆర్థిక వెసులుబాటు కొరకు ఐటీడీఏ నుండి కొంత మొత్తంలో అడ్వాన్స్ గా ఇవ్వాలని, రాబోవు 2025- విద్యా సంవత్సరానికి వీరిని రీ ఎంగేజ్ ఆదేశాలను ఇప్పించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నాయకులు, బాధిత ఉపాధ్యాయులతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నీ కలిసి విజ్ఞప్తి చేశారు.

సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించినారు. అనంతరం టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ శ్రమ దోపిడీ విధానాలలో మరొక రూపంలో కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయుల నియామకాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఆనాటి నోటిఫికేషన్ ప్రకారం జనవరి 2009 లో నియమించేయాల్సిన వీరిని ఫిబ్రవరి 2025లో స్కేల్ పోస్టులో నియమించకుండా, ప్రతినెల రూ. 31040 కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్‌గా చెల్లించే విధంగా నియమింపబడటం, వేసవి సెలవులలో వీరిని టెర్మినేట్ చేయడం దుర్మార్గమన్నారు.

పూర్వ రాష్ట్ర కార్యదర్శి ,ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యులు మునిగడప రామాచారి మాట్లాడుతూ.... గత విద్యా సంవత్సరం చివరి రోజున టర్మినేట్ చేయబడిన ఈ కాంట్రాక్టు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమం ఉన్నందున జూన్ మొదటి తేదీ నుండే రీ ఎంగేజ్ చేసుకోవలసిన అవసరం ఉన్నదన్నారు.

విద్యార్థుల ఎన్రోల్మెంట్ తదితర బడిబాట కార్యక్రమాలలో కూడా వీరి సర్వీసును, భాగస్వామ్యమును కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత ఉపాధ్యాయ ప్రతినిధులు ఎల్.రవి, వి.ముత్యాలరావు, బి.బాబులాల్, బి.కృష్ణకుమారి, బి.చిన్న, ఆర్.రాధాకుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.