calender_icon.png 7 June, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తుపల్లి నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

27-05-2025 12:00:00 AM

కల్లూరు, మే 26(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్క ర్ భవనం , ప్రభుత్వ ఆసుపత్రి ని సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిదయా నంద్ సందర్శించారు. భవన ని ర్మాణ పనులు పరిశీలించి, సం బంధిత కాంట్రాక్టర్‌లతో జరుగు తున్న నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లోని మాత శిశు వార్డ్ ను పరిశీలిన ఆసుపత్రి లో డెలివరీ జరిగిన బాలింతలు,పుట్టిన పసిబిడ్డ ల ఆరో గ్యం ఒక డాక్టర్ గా స్వయంగా వారికి ఆరోగ్యం పరీక్షలు నిర్వహించి పలు సూచనలు తెలియజేశా రు. ఎప్పటికప్పుడు ప్రజలు ఆరోగ్య రీత్యా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నా రు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధుల, హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.