14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఘనంగా గ్లోరియస్ పాఠశాల వార్షికోత్సవం

29-03-2025 08:58 PM

పటాన్ చెరు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది ఉపాధ్యాయులేనని గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ సింహాచలం అన్నారు. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న గ్లోరియస్ పాఠశాల12వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. సందేశాత్మకంగా నిర్వహించిన పలు కళారూప ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 

ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు కెజెఆర్ ఆనంద్ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు వి. ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు పాఠశాల కరస్పాండెంట్ సింహాచలం ప్రిన్సిపాల్ పవిత్ర జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్ లు కొత్వాల్ హరికృష్ణ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, ప్రభుకుమార్, కరుణసాగర్ రెడ్డి, శ్రీనివాస్, లోకానాదం, రాంబాబు, శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాల ప్రతినిధులు మహిపాల్ రెడ్డి, హరిప్రియ, అబకస్ ట్రైనర్ స్నేహ, పాఠశాల ఉపాధ్యాయిలు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.