31-05-2025 12:43:01 AM
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు విజ్ఞప్తి
కార్వాన్: బోనాల ఉత్సవాలకు రావాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు గోల్కొండ జగదాంబికా ఆలయ ట్రస్టీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల ఉత్సవాలకు రావాలని కోరారు. ఉత్సవాలకు హాజరవుతానని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు నాగులపల్లి శ్రీకాంత్,సంతోష్ గౌడ్ ప్రదీప్ కుమార్ ఆకుల, సింగజోగి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోల్కొండ మండలం తహసీల్దార్ అహల్యకు గోల్కొండ బోనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.