16 April, 2026 | 6:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

19-11-2025 12:00 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పులేనంటున్న బుల్ వ్యాపారులు

హైదరాబాద్, నవంబర్ 18: పసిడి, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు తగ్గాయి.దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగిరావడంతో దేశీయంగానూ పసిడి ధరలు బాగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలో రూ.1.56 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగణుంగా పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ నెల 13న పుత్తడి ధర రూ.1.30 లక్షలు ఉంది.