పసిడి ప్రియులకు గుడ్న్యూస్
తగ్గిన బంగారం, వెండి ధరలు
ముంబై, జూన్ 3: పసిడి ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దీంతో ఆభరణాల ప్రియులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దాటుతుందన్న అంచనాలకు బ్రేక్ పడుతోంది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 72,110గా ఉంది. ఇక, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.66,100 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధర కూడా వరుసగా తగ్గుముఖం పడుతోంది. కేజీ వెండి ధర ఒక్క రోజులోనే రూ.700 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర రూ.97,300 గా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు ఇలాగే తగ్గుముఖం పడుతాయని కచ్చితంగా చెప్పలేం.






