29-06-2025 01:15:42 PM
విజయవాడ కనకదుర్గకు హైదరాబాద్ మహాకాళి బోనం సమర్పణ
హైదరాబాద్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాదిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ బంగారు బోనానికి ఈవో, హైదరాబాద్ ఉత్సవ కమిటీ పూజ చేసి మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బ్రాహ్మణవీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ తెలంగాణకు చెందిన 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణతో కోలాహలంగా పోతురాజులు, డప్పు, కోలాటాలతో సందడిగా ఊరేగింపు సాగింది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా బంగారు బోనం సమర్పణ ఆనవాయితీ అయింది.