21-06-2025 01:07:01 AM
26న సమర్పిస్తామని వెల్లడి
కార్వాన్, జూన్ 20: గోల్కొండ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సిద్ధమైంది. గోల్కొండలోని రిసాల బజార్ కు చెందిన బొమ్మల సాయి బాబా చారి, శ్రీకాంత్ చారి కుటుంబం వారికి బంగారు బోనం తయారు చేయించారు. ఈనెల 26న అమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు బంగారు బోనాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించనున్నట్లు తెలియజే శారు. వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
26వ తేదీ ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు తెలిపారు. బొమ్మల సాయి బాబా చారి ఆరు తరాల వారు అమ్మవారికి సేవ చేస్తున్నట్లు తెలియజేశారు. అమ్మవారి కరు ణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
శుక్ర వారం సాయంత్రం రిసాల బజార్ లోని సాయిబాబా చారి కుటుంబం తమ నివాసంలో బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి, శివ చారి, గోల్కొండ విలంబిక అమ్మవారి ఆలయ వృత్తి పని సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.