calender_icon.png 21 June, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాప్యం లేకుండా రేషన్ కార్డులు జారీ చేయండి

21-06-2025 01:05:06 AM

మలక్‌పేట్, జూన్ 20 (విజయ క్రాంతి): రేషన్ కార్డు జారీలో ఎటువంటి జాప్యం లేకుండా అర్హులైన వారికి వెంటనే జారి చేయాలని చావుని డివిజన్ కార్పొరేటర్ ఏం.ఏ. సలాం షాహిద్ అన్నారు. కార్పొరేటర్ సలాం షాహిద్ మలక్‌పేట్ సర్కిల్-1 పౌరసరఫరాల శాఖ ఏ సి ఎస్ ఓ నర్సింగ్ రావు ని కలిసి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కార్పొ రేటర్ సలాంషాహిద్ మాట్లాడుతూ ఎన్నో నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ రేషన్ కార్డులు జారీ కావడం లేదని అన్నారు. మరి కొంతమందికి ఎంక్వయిరీ ల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. అర్హులైన వారికి వెంటనే కార్డులు మంజూరు అయ్యేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.