23-06-2025 01:20:11 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సోమవారం రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాట్లను విద్యార్థినిలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం భోజనం చేస్తే విద్యాబోధన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రెండు రోజుల క్రితం రాత్రి విధి నిర్వహణలో పాఠశాల ఆవరణలో మృతి చెందిన ఉపాధ్యాయురాలు మామిడి స్వప్న మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.