23-06-2025 01:41:33 PM
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయిస్తే, ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళిక సిద్ధిం చేసి జేసీబీలతో భూములను చదును చేసింది. టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ కోరుతూ పిటిషనర్లు హైకోర్టులో వేర్వేరుగా నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సమోటో విచారణకు స్వీకరించింది. కొట్టేసిన చెట్లలో మళ్లీ మొక్కలు నాటాలని సుప్రీ ఆదేశాలు టీజీఐఐసీకి జారీ చేసింది. మొక్కలు నాటకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు బాధ్యులై అధికారులను జైలులో పెడతామని కోర్టు హెచరించింది.