20-06-2025 12:00:00 AM
అదిలాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి): ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానం టూ ప్రజల వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిన షాకిర్ అనే వ్యక్తి ని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో గురువా రం సీఐ సునీల్ కుమార్తో కలిసి మీడియా లో మాట్లాడుతూ.... ఆదిలాబాద్కు చెందిన మహమ్మద్ తాజుద్దీన్ అలియాస్ షాకీర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టు లో టైపిస్టు గా విధులు నిర్వర్తిస్తున్నరని తెలిపారు.
ఇతని చేతిలో మోసపోయిన పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారని, ఒక్కొక్కరి వద్ద లక్షన్న ర రూపాయలు తీసుకొని ప్రభుత్వ స్థలాల ను పేరుతో సర్వే నెంబర్ 29/1లో ఇందిరమ్మ కాలనీ ఖానాపూర్ శివారులో ఖాళీ ప్రదేశాలను చూపించి, నకిలీ పత్రాలను వారికి అందజేసి మోసం చేసిన సందర్భంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు.
పరారీలో ఉన్న నిందితు న్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పా టు చేసి బైంసాలో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇతనుపై గతంలో ఏడు కేసు లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వ్యక్తి గతంలో సర్వే నెంబర్ 170 ప్రజలకు నకిలీ పత్రాలు చూపించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అని చెప్పి మోసం చేసిన కేసు లు నమోదు అయి ఉన్నాయని విషయాన్ని తెలిపారు.
ప్రజలు గుడ్డిగా మోసగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలని తెలిపారు. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఇంకా తెలియని వారు ఇతని ద్వారా మోసపోయిన వారు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు.