20-06-2025 12:00:00 AM
ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించిన ఎస్పీ అఖిల్
అదిలాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి): ప్రయాణికుల భద్రత కోసం జిల్లాలో ‘మై టాక్సీ ఇస్ సేఫ్‘ అనే కార్యక్రమం ప్రారంభమైన సందర్భంలో ఉట్నూర్ సబ్ డివిజనల్ లోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ఉట్నూర్ సబ్ డివిజనల్ లో ప్రయాణికుల, మహిళల, విద్యార్థినీ విద్యార్థుల రక్షణకై నూతనంగా జిల్లాలో మై టాక్సీ ఇస్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల ప్రజ లలో భద్రతాభావాన్ని పెంపొందించవచ్చని దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావున యువతులు మహిళలు ప్రయాణికులు భద్రత చర్యలలో భాగంగా జిల్లాలోని ఇప్పటివరకు 3,232 ఆటోలలో ‘అభయ మై టాక్సీ ఇస్ సేఫ్‘ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా అందులో ఉట్నూర్ సబ్ డివిజన్లో 850 ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకున్నవని తెలిపారు.
ఆటో డ్రైవర్ వివరాలు, క్యూఆర్ కోడ్, ఆటో రిజిస్ట్రేషన్ నెంబ ర్ కనబడే విధంగా తగు పోస్టర్లను శాశ్వతం గా అతికించడం జరుగుతోందన్నారు. నేరా ల నియంత్రణకు, నేరాల అదుపున కు ప్రతి ఒక్కరూ అభయ మై టాక్సీ ఇస్ సేఫ్ అనే కార్యక్రమంలో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్సై మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు.